Breaking News

కోదాడ బైపాస్ వద్ద ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు, పలువురికి గాయాలు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ బైపాస్ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఇంటర్ సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 36 మందిలో 16 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని కోదాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదం తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *