ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ములుగు జిల్లాలోని ప్రసిద్ధ గట్టమ్మ అమ్మవారి ఆలయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు, అధికారులు సంప్రదాయ పద్ధతిలో పూర్ణకుంభ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వారు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. భక్తి వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

