ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: అమెరికా–ఇరాన్ మధ్య కీలక చర్చలు జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. విదేశీ ప్రతినిధుల రాకతో నగరంలో లాక్డౌన్ తరహా పరిస్థితులు నెలకొన్నాయి.సమావేశాలు సజావుగా జరిగేలా ప్రభుత్వం రెండు రోజులపాటు సెలవులు ప్రకటించింది. విద్యాసంస్థలు, కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలు మూతపడ్డాయి. ముఖ్యంగా సమావేశం జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను పూర్తిగా నియంత్రించారు.భద్రత కోసం భారీగా పోలీసు బలగాలు, పారామిలటరీ దళాలను మోహరించి, సీసీటీవీలు, డ్రోన్లతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ చర్చల్లో అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షలు వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.
