ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ఎన్సీపీ నేత, మంత్రి ఛగన్ భుజ్బల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ప్రమాదం తృటిలో తప్పింది. ముంబై నుంచి పూణేకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.నిర్దేశిత హెలిప్యాడ్పై దిగాల్సిన హెలికాప్టర్, పొరపాటున కార్ పార్కింగ్ ప్రాంతంలో ల్యాండ్ అయింది. దీంతో అక్కడ ఉన్న వాహనాలకు ప్రమాదం సంభవించే పరిస్థితి ఏర్పడింది. అయితే పైలట్ సమయోచితంగా వ్యవహరించడంతో ఎలాంటి అనర్థం జరగలేదు.ఈ ఘటనలో మంత్రి సహా ఎవరూ గాయపడకపోవడం ఊరటనిచ్చింది. ఆయన సురక్షితంగా బయటపడ్డారు.ఈ సంఘటనపై భద్రతా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. సాంకేతిక లోపమా లేదా మానవ తప్పిదమా అన్న అంశంపై విచారణ కొనసాగుతోంది.
