ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరం గ్లోబల్ సామర్థ్య కేంద్రాల ఏర్పాటుకు కీలక కేంద్రంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫైనాన్స్, టెక్నాలజీ సంస్థలు నగరాన్ని తమ కార్యకలాపాల విస్తరణకు ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయని చెప్పారు.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సమావేశంలో విదేశీ సంస్థ ప్రతినిధులతో మంత్రి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా పాల్గొన్నారు. హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఏర్పాటు చేయడానికి పలు సంస్థలు ముందుకు వస్తున్నాయని వెల్లడించారు.నగరంలో ఉన్న నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని మంత్రి వివరించారు. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో కార్యాలయ స్థలాలు లభించడం కూడా పెద్ద ప్లస్గా మారిందన్నారు.భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, దీర్ఘకాలిక ప్రణాళికలతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ వినియోగం ఎక్కువగా ఉండటం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సూచిస్తోందని మంత్రి చెప్పారు. ట్రాఫిక్, కాలుష్య సమస్యలు తక్కువగా ఉండటంతో ఐటీ కంపెనీలు హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నాయని వెల్లడించారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి వ్యాపార కేంద్రంగా మరింత ఎదగనుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.
