Breaking News

ములుగులో మంత్రి సీతక్క ఆగ్రహం.. తప్పుడు ప్రచారంపై హెచ్చరిక

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క ప్రత్యర్థి పార్టీలపై తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మేడారం ఘటనను రాజకీయాలకు వాడుకోవడం బాధ్యతారాహిత్యమని పేర్కొంటూ, ఇలాంటి సున్నిత అంశాలపై రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించడం సరైంది కాదన్నారు.అంగన్‌వాడీ సిబ్బందికి సెల్‌ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందని చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, అవి పూర్తిగా తప్పుడు ప్రచారమని తెలిపారు. ఈ విషయంలో భారత రాష్ట్ర సమితి అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు.ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తోందని, ప్రజలకు న్యాయం జరిగేలా కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కంటే ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. తప్పుడు ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలనుకుంటే సహించబోమని మంత్రి సీతక్క హెచ్చరించారు.

ములుగులో డీసీసీ సమావేశం.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం

అంబేద్కర్ జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *