Breaking News

ములుగులో డీసీసీ సమావేశం.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ములుగు జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో డీసీసీ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్ కూడా పాల్గొన్నారు.సమావేశాన్ని టీపీసీసీ చీఫ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం డీసీసీ కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమానికి ముందు ములుగు పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు టీపీసీసీ చీఫ్‌కు ఘన స్వాగతం పలికాయి. భారీ గజమాలతో స్వాగతం తెలుపుతూ నాయకులు ఉత్సాహం వ్యక్తం చేశారు.భారీ ర్యాలీతో కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. పార్టీ బలోపేతం, గ్రామస్థాయి విస్తరణపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి.పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని నేతలు తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *