ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ వినూత్న దృశ్యం ప్రజలను ఆకట్టుకుంటోంది. సాధారణంగా తోపుడు బండిపై కూరగాయలు, పండ్లు అమ్మడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం బంగారు ఆభరణాలు, నాణేలు విక్రయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఈ వినూత్న మార్కెటింగ్ వెనుక ఒక ప్రముఖ జ్యువెలరీ సంస్థ ఉందని తెలుస్తోంది. సాధారణ ప్రకటనల కంటే భిన్నంగా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఈ ప్రత్యేక ప్రచారం చేపట్టింది. భద్రతా పరంగా సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.ఈ ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. బంగారం కొనుగోలు చేయడానికి మాత్రమే కాకుండా, ఈ దృశ్యాన్ని చూసేందుకు కూడా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పర్యాటకులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.ఇక ఈ బండిపై రూ.800కే బంగారు నాణెం అందిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. మేకింగ్ ఛార్జీలు లేకుండా విక్రయించడం వల్ల కొనుగోలుదారులు ముందుకు వస్తున్నారు. అయితే భద్రతా కారణాల వల్ల తక్కువ విలువ గల బంగారు వస్తువులనే ఇక్కడ విక్రయిస్తుండగా, ఖరీదైన ఆభరణాలు మాత్రం షోరూమ్లలోనే అందుబాటులో ఉంచినట్లు సంస్థ వెల్లడించింది.
