ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా కాంగ్రెస్దే అధికారం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్గా మార్చినా లేదా మరో రూపంలో వచ్చినా ప్రజలు స్వీకరించే పరిస్థితి లేదన్నారు.సింగరేణిలో జరిగిన అన్ని ఒప్పందాలు బీఆర్ఎస్ పాలనలోనే జరిగాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఏ పార్టీకి లేదని చెప్పారు.అలాగే, కేటీఆర్ పాదయాత్ర చేపట్టినా స్వాగతిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలపై ఎవరైనా మాట్లాడితే తమకు అభ్యంతరం లేదని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
