Breaking News

ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు.. వైద్య పరీక్షలకు వేగవంతమైన సేవలు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ప్రజలకు వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయనుంది. ఈ యంత్రాల ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే సుమారు 130 రకాల వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. రక్తపోటు, షుగర్, హీమోగ్లోబిన్ వంటి కీలక పరీక్షలు తక్షణమే పూర్తవుతాయి. ఈ సేవలు ఉచితంగా అందుబాటులోకి రానుండటంతో రోగులకు ఆర్థిక భారం తగ్గనుంది.హైదరాబాద్‌లోని కింగ్ కోఠి, మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయగా మంచి స్పందన వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుండటంతో వైద్య సేవలు మరింత సులభతరం కానున్నాయి.

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన

చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో ఆస్తి వివాద ఆరోపణలు.. కొత్త దర్యాప్తు ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *