ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ప్రజలకు వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయనుంది. ఈ యంత్రాల ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే సుమారు 130 రకాల వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. రక్తపోటు, షుగర్, హీమోగ్లోబిన్ వంటి కీలక పరీక్షలు తక్షణమే పూర్తవుతాయి. ఈ సేవలు ఉచితంగా అందుబాటులోకి రానుండటంతో రోగులకు ఆర్థిక భారం తగ్గనుంది.హైదరాబాద్లోని కింగ్ కోఠి, మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేయగా మంచి స్పందన వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుండటంతో వైద్య సేవలు మరింత సులభతరం కానున్నాయి.
