Breaking News

ఆర్టీసీ కార్మికుల సమ్మె హెచ్చరిక.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు కీలకం

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమవుతున్నారు. వేతన సవరణలు, బెనిఫిట్స్, సర్వీస్ సంబంధిత సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలంటూ జేఏసీ డిమాండ్ చేస్తోంది.ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం లేబర్ కమిషనర్‌తో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చలు జరగనున్నాయి. చర్చల ఫలితాన్ని బట్టి సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని జేఏసీ నేతలు తెలిపారు.ఇప్పటికే ఈ నెల 20 నుంచి సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు హెచ్చరిక జారీ చేశాయి. గతంలో ఇచ్చిన నోటీసులకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని వారు పేర్కొంటున్నారు. ఈసారి కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమని తెలిపారు.అన్ని డిపోల కార్మికులు ఏకమవాలని జేఏసీ పిలుపునిచ్చింది. తమ హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది.ఒకవేళ సమ్మె ప్రారంభమైతే ఆర్టీసీ సేవలు నిలిచిపోయే అవకాశం ఉండటంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని భావిస్తున్నారు.

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన

చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో ఆస్తి వివాద ఆరోపణలు.. కొత్త దర్యాప్తు ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *