Breaking News

కేసీఆర్‌కు లీగల్ నోటీసు జారీ చేసిన మంత్రి సీతక్క.. 48 గంటల్లో క్షమాపణ డిమాండ్

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు అంశంపై బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆమె పేర్కొన్నారు.ఈ ఆరోపణల వల్ల తన ప్రతిష్ఠకు నష్టం జరిగిందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె తేల్చిచెప్పారు. ఈ దుష్ప్రచారానికి కేసీఆర్‌దే బాధ్యత అని నోటీసులో పేర్కొంటూ, సంబంధిత పోస్టులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు.లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *