Breaking News

పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలంటూ సుప్రీంలో పిల్.. కేంద్రానికి నోటీసులు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఫింగర్ ప్రింట్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలైంది.ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి మరియు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు బయోమెట్రిక్ వ్యవస్థ అవసరమని పిటిషనర్ తరఫు వాదనలు వినిపించగా, దొంగ ఓట్లను అరికట్టడమే లక్ష్యంగా ఈ విధానం తీసుకురావాలని అభ్యర్థించారు.ఈ అంశంపై కేంద్రం, ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తాయన్నది కీలకంగా మారింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *