Breaking News

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ రెండు అంశాలను వేర్వేరుగా చూడాలని, వాటిని కలిపి అమలు చేయడం వల్ల అనేక ప్రాంతాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేస్తే దేశవ్యాప్తంగా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తారని సీఎం రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెరగడం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే డీలిమిటేషన్ ప్రక్రియపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అభివృద్ధి, కుటుంబ నియంత్రణ వంటి అంశాల్లో ముందంజలో ఉన్న రాష్ట్రాలకు ఇది ప్రతికూలంగా మారవచ్చని ఆయన లేఖలో పేర్కొన్నారు.డీలిమిటేషన్ వల్ల రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని, కొన్ని పార్టీలు లాభపడే పరిస్థితి ఏర్పడవచ్చని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే పార్టీ ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ఎప్పుడూ ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.ప్రజాస్వామ్యంలో సమతుల్యత, ప్రాంతీయ న్యాయం అత్యంత కీలకమని ఆయన తెలిపారు. అందుకే ఈ రెండు అంశాలపై విస్తృత చర్చ జరగాలని, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రధానికి రేవంత్ రెడ్డి సూచించారు.ఈ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై భవిష్యత్‌లో కేంద్రం తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.

పారదర్శకంగా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పంపిణీ.. ప్రజా పాలనపై ప్రభుత్వ దృష్టి

దేవాలయాల్లో అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలి.. గర్భగుడి ప్రవేశంపై మంద కృష్ణ డిమాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *