Breaking News

అసిస్టెంట్ కమిషనర్ శాంతికి రెండు రోజుల పోలీస్ కస్టడీ మంజూరు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఆక్రమాస్తుల కేసులో అరెస్టయిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతికి ఏసీబీ కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీ మంజూరు చేసింది. ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఆమెను విచారించేందుకు ఏసీబీ అధికారులకు అనుమతి లభించింది.ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్న శాంతిని త్వరలోనే కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆస్తుల మూలాలు, ఆర్థిక లావాదేవీలు, సంబంధిత వ్యక్తుల వివరాలపై లోతుగా దర్యాప్తు జరపనున్నారు. ఇంతకుముందు ఈ నెల 7న ఏసీబీ అధికారులు తాడేపల్లి, ఉండవల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లో శాంతికి చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సుమారు 10 గంటలపాటు సాగిన ఈ సోదాల్లో కీలక ఆధారాలు లభించాయి.దర్యాప్తులో భాగంగా ఆమె ఆదాయానికి మించి సుమారు రూ.1.37 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. నగదు, బంగారం, స్థిరాస్తులు, పత్రాలు వంటి వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు పంపించారు.ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత పెంపు, అవినీతి నిర్మూలన దిశగా చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

ఏపీలో కొత్త ఉద్యోగ విధానం అమలు.. స్థానికులకు అధిక ప్రాధాన్యం

కడప దస్తగిరి హత్య కేసు మలుపు.. భూవివాదాలే కారణమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *