Breaking News

డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్.. ప్రజా రవాణాకు అంతరాయం భయం

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్కు చెందిన కార్మికులు ఈ నెల 22వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉండటంతో ప్రజలు రవాణా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలగవచ్చు.కార్మికులు ప్రభుత్వంపై పలు డిమాండ్లు ఉంచారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే వేతన సవరణ, 30 శాతం ఫిట్‌మెంట్, సర్వీస్ బెనిఫిట్స్ వంటి అంశాలను కూడా ముందుకు తెచ్చారు.ఇటీవల లేబర్ శాఖ అధికారులతో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల ఆర్టీసీ వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన స్పందన రాకపోవడంతో సమ్మెపై ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారాయి.

కొత్తగూడెంలో రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు ప్రారంభం.

ఆర్టీసీ కార్మికుల ధర్నాకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మద్దతు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *