ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి మానవ నిపుణుల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ప్రముఖ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సంస్థ LinkedIn కొత్త ప్రయోగాన్ని ప్రారంభించింది. “ఏఐ లేబర్ మార్కెట్ప్లేస్” పేరుతో ఈ ప్లాట్ఫామ్ను ప్రస్తుతం పరీక్ష దశలో నిర్వహిస్తోంది.ఈ విధానం ద్వారా కోడింగ్, ఫైనాన్స్, నర్సింగ్ వంటి విభిన్న రంగాల నిపుణులు ఏఐ మోడళ్లకు శిక్షణ ఇస్తారు. వారు చాట్బాట్లతో కనెక్ట్ అయి సమాధానాలను పరిశీలించడం, వాటి కచ్చితత్వాన్ని అంచనా వేయడం వంటి పనులు చేస్తారు.ఏఐ ఇచ్చే సమాధానాలను సమీక్షించి, అవసరమైన చోట సరిదిద్దడం ద్వారా మోడళ్ల పనితీరును మెరుగుపరచడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం ఇది ప్రారంభ దశలోనే కొనసాగుతోంది.ఈ పనుల కోసం నిపుణుల నైపుణ్యాన్ని బట్టి గంటకు రూ.3,300 నుంచి రూ.14,000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉన్నట్లు సంస్థ తెలిపింది. దీంతో ఫ్రీలాన్స్ వర్క్లో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.ఏఐ వ్యవస్థలను మరింత ఖచ్చితంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడంలో మానవ సమీక్ష కీలక పాత్ర పోషిస్తుందని లింక్డిన్ అభిప్రాయపడుతోంది.
