ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్లో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు అంబేద్కర్ సేవలను స్మరించారు.నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమని కొనియాడారు. సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం వంటి విలువలను రాజ్యాంగంలో స్థాపించిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ అంబేద్కర్ చూపించిన మార్గం నేటి తరానికి ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి సమానత్వాన్ని నెలకొల్పడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కార్యరూపంలోకి తీసుకురావడమే నిజమైన నివాళి అని అన్నారు. విద్య, సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వంలో ఆయన ఆలోచనలు ఇప్పటికీ ప్రాసంగికమని పేర్కొన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. “జై భీమ్” నినాదాలతో ప్రాంగణం మార్మోగింది.
