ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఖమ్మం జిల్లాలో జరిగిన డీసీసీ కార్యవర్గ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, కాంగ్రెస్ శ్రేణులు నాయకులకు ఘన స్వాగతం పలికారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.




