ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీష్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. చివరి మంత్రివర్గ సమావేశం అనంతరం గవర్నర్ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.ఆ వెంటనే జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సమ్రాట్ చౌదరి ను ఏకగ్రీవంగా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.సామ్రాట్ చౌదరి రాజకీయ ప్రస్థానం విశేషంగా సాగింది. ముంగేర్ జిల్లాకు చెందిన ఆయన 1990లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదట ఆర్జేడీలో పనిచేసి, 1999లో రబ్రీ దేవి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.తర్వాత జేడీయూలో చేరి జితన్ రామ్ మాంఝీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2018లో భారతీయ జనతా పార్టీ లో చేరిన తర్వాత ఆయన రాజకీయంగా మరింత ఎదిగారు. బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.ఈ పరిణామాలతో బీహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎన్డీఏ నేతలు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపిన సామ్రాట్ చౌదరి, రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తామని చెప్పారు.బుధవారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మార్పుతో బీహార్ రాజకీయాల్లో కొత్త దిశ ఏర్పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
