ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని నారాయణదాస్గూడలో జరిగిన తల్లి–కూతురు మృతి కేసులో అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ ఘటనను పోలీసులు విచారించగా ఇది ప్రమాదం కాదని, పూర్వ ప్రణాళికతో చేసిన హత్యగా తేలింది.పోలీసుల వివరాల ప్రకారం, భార్య లావణ్య తరచూ ఫోన్లో మాట్లాడుతుందనే అనుమానంతో భర్త శ్రీనివాస్ తరచూ గొడవపడేవాడు. ఈ వివాదాలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చాయి.ఈ నేపథ్యంలో భార్యను అంతమొందించాలని నిర్ణయించిన శ్రీనివాస్, ముందుగానే పెట్రోల్ తీసుకువచ్చి భార్య, కూతురిపై పోసి నిప్పంటించాడు. మంటలు చెలరేగడంతో తల్లి, కూతురు కేకలు వేయగా, చుట్టుపక్కల వారు పరుగెత్తుకొచ్చారు.అయితే ఘటనను దాచిపెట్టేందుకు శ్రీనివాస్ గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగాయని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
