Breaking News

జగన్ సీపీఆర్‌వో శ్రీహరి అరెస్ట్.. సోషల్ మీడియా పోస్టులపై చర్యలు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి సీపీఆర్‌వోగా పనిచేసిన పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్టులు వివాదాస్పదంగా మారడంతో ఈ చర్యలు తీసుకున్నారు.చంద్రబాబు పై విమర్శలు చేస్తూ కత్తి పట్టినట్లుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పోస్టులు ఉద్రిక్తతలకు దారితీసేలా ఉన్నాయని పోలీసులు భావించారు.ఈ ఘటనపై చిత్తూరు జిల్లాలో కేసు నమోదు చేసి, నేడు శ్రీహరిని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో ఆయన వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *