ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: డీలిమిటేషన్ బిల్లుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే ఎలాంటి నిర్ణయాన్ని తమ పార్టీ అంగీకరించదని స్పష్టం చేశారు.ఈ అంశంపై ఎర్రవెల్లి ఫామ్హౌస్లో కె. టి. రామారావు, టి. హరీష్ రావు లతో కలిసి సమావేశమై చర్చించినట్లు సమాచారం. డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించిన వివిధ అంశాలను సమగ్రంగా పరిశీలించినట్లు తెలిపారు.మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని కేసీఆర్ వెల్లడించారు. అయితే 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.అందువల్ల బిల్లును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే బీఆర్ఎస్ పార్టీ తమ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తెలిపారు. ఈ అంశంపై మరింత చర్చ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
