Breaking News

చంద్రబాబుకు జగన్ హెచ్చరిక.. జువ్వలదిన్నె అంశంపై ఘాటు వ్యాఖ్యలు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: జువ్వలదిన్నె ప్రాజెక్టు వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో ప్రైవేట్ కంపెనీకి భూములు కేటాయిస్తూ మత్స్యకారులను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.పక్కనే కృష్ణపట్నం పోర్టు ఉన్నప్పటికీ, మరో ప్రైవేట్ సంస్థకు ఇక్కడ భూములు ఇవ్వడం సరైంది కాదని జగన్ విమర్శించారు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబుకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. త్వరలోనే పరిస్థితులు మారుతాయని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.అధికారంలోకి వచ్చిన వెంటనే జువ్వలదిన్నె ప్రాజెక్టులో ఉన్న ప్రైవేట్ కంపెనీని అక్కడి నుంచి తొలగిస్తామని జగన్ స్పష్టం చేశారు. మత్స్యకారుల హక్కులను కాపాడేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *