కోదాడ ,ఏప్రిల్ 15(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,మునగాల మండలం కృష్ణానగర్ కు చెందిన జూకంటి వెంకయ్య పుష్పమ్మ ల,మనవడు జూకంటి సంపత్ కుమార్ కు ఇంటర్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి ,తెలంగాణ రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచారు. హైదరాబాదు జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నారు. హైదరాబాద్ ఎస్ పి ఎస్ అకాడమీ లో ఇంటర్ ఎంపీసీ చదువుతున్న సంపత్ కుమార్ కు రాష్ట్రస్థాయి ర్యాంకు రావడం పట్ల డైరెక్టర్లు విద్యార్థిని ఘనంగా సన్మానించారు. విద్యార్థి తల్లిదండ్రులైన శ్రీనివాస్ సుధారాణులను డైరెక్టర్లు అభినందించారు. ర్యాంకు సాధించిన జూకంటి సంపత్ కుమార్ ను మునగాల మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కృష్ణానగర్ గ్రామస్తులు ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు అభినందించారు. సంపత్ కుమార్ భవిష్యత్తులో మరెన్నో ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు.

