Breaking News

తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎంపీ సానా సతీష్ బాబు నియామకం

క్యాడర్ టు లీడర్ టిడిపిలోనే సాధ్యం” – సానా సతీష్ బాబు

అన్నార్తుల ఆకలి తీర్చడానికే అన్న క్యాంటీన్లు.

అమరావతి, ఏప్రిల్ 15, 2026, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు.ఈ సందర్భంగా సానా సతీష్ బాబు గారు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈరోజు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించగా, మొత్తం 18 మంది సభ్యులతో కూడిన జాతీయ ఉపాధ్యక్షుల బృందంలో సానా సతీష్ బాబుకు స్థానం కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,“క్యాడర్ నుంచి లీడర్‌గా ఎదగడానికి అవకాశం తెలుగుదేశం పార్టీలోనే ఉంది. కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ తప్పకుండా గుర్తింపు ఇస్తుంది” అని తెలిపారు.తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి, ప్రజలకు మరియు పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

ఏప్రిల్ 11,2026 నుండి కరెన్సీ, కమోడిటీ, నగదు మరియు ఈక్విటీ డెరివేటివ్స్ విభాగాలలో నానోసెకండ్-లెవల్ ఆర్డర్ గుర్తింపును సాధించిన ఎన్ఎస్ఈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *