ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: నియోజకవర్గాల పునర్విభజన అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాల్లో స్పష్టతలేని వైఖరి ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు.తెలంగాణకు తగిన ప్రాతినిధ్యం లేదని భావిస్తే, అదే పార్టీ పాలనలో ఉన్న కేరళలో లోక్సభ స్థానాలపై ముందుగా ప్రశ్నించాలన్నారు. కేవలం రాజకీయ లాభాల కోసమే కాంగ్రెస్ ఈ అంశాన్ని ముందుకు తెస్తోందని విమర్శించారు.గతంలో డీలిమిటేషన్ అవసరమని చెప్పిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు అదే ప్రక్రియను వ్యతిరేకించడం ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్లు అమలు కావాలంటే డీలిమిటేషన్ తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.దేశవ్యాప్తంగా సమాన ప్రాతినిధ్యం కోసం రాజ్యాంగబద్ధమైన ప్రక్రియగా డీలిమిటేషన్ అవసరమని, దీనిని ప్రాంతీయ భావోద్వేగాలతో ముడిపెట్టడం సరైంది కాదన్నారు. బీజేపీ మాత్రం మహిళా సాధికారత, సమాన రాజకీయ అవకాశాల దిశగా కట్టుబడి ఉందని తెలిపారు.ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో డీలిమిటేషన్ అంశం మరింత హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్–బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
