ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, తరువాత చట్టంలో లేదని చెప్పి అమలు చేయకపోవడం అన్యాయమని ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం ప్రజల్లో నిరాశ కలిగించిందని అన్నారు.డీలిమిటేషన్ ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా దీన్ని వాడకూడదని హెచ్చరించారు. దేశ అభివృద్ధి, సమతుల్యత దృష్ట్యా డీలిమిటేషన్ను అమలు చేయాలని సూచించారు.ప్రతి రాష్ట్రానికి న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, దేశ నిర్మాణానికి ఉపయోగపడే విధంగా డీలిమిటేషన్ ఉండాలని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా, డీలిమిటేషన్పై మిథున్ రెడ్డి విమర్శలు
