Breaking News

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆనందం.. ఈటెలకు కార్పొరేటర్ల కృతజ్ఞతలు

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్‌కు MMC కార్పొరేటర్లు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపాలని ఆయన ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లి, ఆయన నివాసంలో జరిగిన చర్చల్లో పాల్గొన్నారుతదనంతరం పార్లమెంట్‌లో జరిగిన బిల్లుపై చర్చలు, ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించిన కార్పొరేటర్లు, ఈ చారిత్రాత్మక సందర్భానికి తాము సాక్షులుగా నిలవడం గర్వకారణమని తెలిపారు. మహిళల సాధికారతకు ఇది కీలక నిర్ణయమని పేర్కొన్నారు.సునీత శేఖర్ యాదవ్ మాట్లాడుతూ, భారత రాజకీయాల్లో మహిళల పాత్రను పెంచే దిశగా ఈ బిల్లు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో క్యానం రాజ్యలక్ష్మి, మీనా ఉపేందర్ రెడ్డి, కొంతం దీపిక, ఆకుల శ్రీవాణి, నర్మదా, విజయలక్ష్మి తదితర కార్పొరేటర్లు పాల్గొన్నారు.

స్టాండప్ కామెడీ వివాదం.. అనుదీప్ కటికలపై చర్యలకు ఆదేశాలు

కాళేశ్వరం పునరుద్ధరణపై దృష్టి.. దురుద్దేశం లేదన్న మంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *