Breaking News

అంబటి అనుదీప్ హత్య కేసులో వేగవంతమైన విచారణకు డిమాండ్: రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: అంబటి అనుదీప్ హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ డిమాండ్ చేశారు. ఈ కేసుకు విచారణ అధికారిగా నియమితులైన పెదవేగి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌ను శుక్రవారం ఏలూరులోని వారి కార్యాలయంలో కలిసి, కేసు పురోగతిపై చర్చించారు.ఈ సందర్భంగా చందు జనార్దన్ మాట్లాడుతూ, హత్యకు ముందు అనుదీప్‌ను బెదిరించిన వ్యక్తులను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఘటన జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు కేసులో అనేక అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చినప్పటికీ, వాటిపై స్పష్టత రాకపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.దర్యాప్తు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఇక ఈ కేసుపై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు ఆదివారం సాయంత్రం చట్రాయ్‌లోని అంబటి అనుదీప్ నివాసంలో సమావేశం నిర్వహించనున్నట్లు చందు జనార్దన్ ప్రకటించారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొని ముందడుగు చర్యలపై చర్చించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తుమ్మల జగన్, అనుదీప్ తండ్రి అంబటి గోపి, జేఏసీ నేతలు ఏవి శ్రీనివాస్, జగదీష్, కడవకొల్లు సాగర్, శ్రీనివాస్‌తో పాటు స్థానిక యువ నాయకులు పాల్గొన్నారు.అంబటి అనుదీప్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో, బాధిత కుటుంబానికి న్యాయం ఎప్పుడు జరుగుతుందన్న ప్రశ్నలు మరింతగా వినిపిస్తున్నాయి.

పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. ఇద్దరు కమెడియన్లపై పోలీసుల చర్యలు

ప్రత్యేక హోదా, డీలిమిటేషన్‌పై మిథున్ రెడ్డి విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *