ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ల అంశంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని తెలంగాణ మంత్రి సీతక్క విమర్శించారు. మహిళల సాధికారత పేరుతో బిల్లు తీసుకొచ్చినా, అమలును మాత్రం కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్ వంటి క్లిష్ట అంశాలను బిల్లుతో ముడిపెట్టడం వల్ల మహిళా రిజర్వేషన్లు తక్షణం అమలులోకి రావడం లేదని ఆమె పేర్కొన్నారు. నిజంగా మహిళలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఉంటే ఎలాంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.మహిళలు ఎన్నో ఏళ్లుగా ఈ హక్కు కోసం ఎదురుచూస్తున్నారని, అలాంటి కీలక విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని అన్నారు. మహిళల ఓట్ల కోసం మాత్రమే బీజేపీ ఈ బిల్లును తీసుకువచ్చిందని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ మాత్రం మహిళా హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉందని స్పష్టం చేసిన సీతక్క, మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
