ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మహిళల హక్కులను నిర్లక్ష్యం చేసిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ బిల్లును అడ్డుకోవడం మహిళా సాధికారతకు వ్యతిరేక చర్య అని అన్నారు.సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, మహిళల హక్కుల విషయంలో రాజకీయాలు చేయకుండా అన్ని పార్టీలు కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ మహిళలకు సముచిత స్థానం కల్పించేందుకు ఈ బిల్లు కీలకమని పేర్కొన్నారు.మహిళా రిజర్వేషన్ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య విభేదాలు కొనసాగుతుండగా, రాజకీయ వర్గాల్లో చర్చ మరింత ఉధృతమవుతోంది.
