ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను నమ్మబలికి మోసం చేశాడని మరో పోలీసు కానిస్టేబుల్పై ఆమె ఆరోపణలు చేసినట్లు సమాచారం.ఈ ప్రేమ వ్యవహారం విఫలమవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళా కానిస్టేబుల్ ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటన వెంటనే గమనించిన సహచరులు ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతుండగా, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ ప్రారంభించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్పై తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
