ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి గూగుల్, Meta, X, YouTube సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో తనపై ప్రచారంలో ఉన్న తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులను వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. తనను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని అపోహలు సృష్టించేలా పోస్టులు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. అసత్య కథనాలను వ్యాప్తి చేస్తున్న అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని, సంబంధితులు క్షమాపణలు చెప్పాలని ఆమె కోరారు.ఇదే విషయంపై Think Andhra, M9 News సంస్థలకూ భారతీ రెడ్డి నోటీసులు పంపినట్లు సమాచారం.
