విజయవాడ. ఏప్రిల్ 18 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మహిళల సాధికారతపై సంవత్సరాలుగా నినాదాలు ఇస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం ఇప్పుడు దేశం ముందుకు పూర్తిగా బయటపడింది. నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళల రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా, మహిళల పట్ల తమ నిజమైన నిబద్ధత ఏంటో స్పష్టంగా వెల్లడిం చింది. ఈ సందర్భంగా విజయవాడ జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఓసమావేశంలో మాట్లాడుతూ ఈ బిల్లు ను అడ్డు కోవడం కేవలం రాజకీయ విభేదం కాదు ఇది దేశం లోని కోట్లాది మహిళల ఆశయాలు, హక్కులు, భవిష్యత్తుపై నేరుగా చేసిన దాడి. మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే చారి త్రాత్మక అవకాశాన్నికూడా స్వార్థ రాజకీయాల కోసం త్యాగం చేయడం అత్యం త దుర దృష్టకరం. ఇలాం టి చర్యలు దేశ చరిత్రలో ప్రజల హక్కులను అణచి వేసిన సంఘటనలను గుర్తు చేస్తాయి. మనకు ఒక స్పష్టమైన పాఠం చెబుతుంది. ప్రజల స్వరా న్ని అణచివేయడం ఎప్ప టికీ సమర్థనీయం కాదు. అదే విధంగా మహిళలగ ళాన్ని అణిచే ఈరోజు రాజకీయాలు కూడా తీవ్రంగా ఖండించాల్సిన వే. సంవత్సరాలుగా మహిళల పేరుతో ఓట్లు అడిగిన కాంగ్రెస్, నిజంగా వారికి హక్కులు ఇవ్వా ల్సిన సమయంలోమాత్రం వెనక్కి తగ్గింది. మాటల్లో సాధికారత, చేతల్లో అడ్డం కులు ఇదే వారి రాజకీయ సంస్కృతి. దేశం మారు తోంది. మహిళలు ప్రతి రంగంలో ముందుకు సాగ తున్నారు. వారి గళం మ రింత బలంగా వినిపిస్తోం ది. అలాంటి సమయంలో మహిళల హక్కులను అడ్డుకునే ప్రయత్నాలు ఎంతకాలం నిలవవు మహిళల అభ్యున్నతికి అడ్డుగా నిలిచిన పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచి పోతుంది. దేశం దీనిని గమనిస్తోంది. మహిళలు దీనికి తగిన సమాధానం ఇస్తారు అని అన్నారు.
