Breaking News

ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలు

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు తిరస్కరణకు గురైన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ స్పందించారు. ఆ బిల్లు మహిళల హక్కుల పరిరక్షణకు సంబంధించినది కాదని, డీలిమిటేషన్ అంశంతో కూడా సరైన సంబంధం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.విపక్షాలు ఒక్కటిగా నిలబడి ప్రభుత్వాన్ని ఓడించాయని ఆమె పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక ముఖ్యమైన విజయమని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు లోక్‌సభలో ఓటమి చెందడం గమనార్హమని చెప్పారు.ఈ పరిణామాన్ని ఎన్డీయేకు చీకటి రోజుగా పేర్కొంటూ, ప్రజాస్వామ్య పరిరక్షణలో విపక్షాల ఐక్యత కీలకమని ప్రియాంకా గాంధీ అన్నారు.

భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: ప్రధాని మోదీ

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. మోదీ ప్రభుత్వం ఏం చేయబోతోంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *