Breaking News

భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: ప్రధాని మోదీ

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు తిరస్కరణకు గురైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళల హక్కులు, వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకొచ్చిన బిల్లును అడ్డుకోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.మహిళల సాధికారతను అడ్డుకునే ప్రయత్నాలు చేసే వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ప్రధాని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు బాధ్యులైన వారు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం దేశ అభివృద్ధికి అత్యంత అవసరమని, అందుకే ఈ బిల్లును తీసుకొచ్చామని ప్రధాని చెప్పారు. కానీ విపక్షాలు ఏకమై బిల్లును అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించే దిశగా చర్యలు కొనసాగుతాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *