ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: ఇటీవల అనారోగ్యానికి గురై ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అవనిగడ్డకు చెందిన ప్రైమ్ 9 రిపోర్టర్ అంబటి వెంకట రమణ కుమార్తె శరణ్యను రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ పరామర్శించారు. అవనిగడ్డలోని వారి నివాసానికి వెళ్లిన ఆయన, బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు.శరణ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆమెకు ధైర్యం చెప్పారు. వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని, అవసరమైతే సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చందు జనార్దన్ తెలిపారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. శరణ్య త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షించారు.
