ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గణపేశ్వరం గ్రామంలో ఇటీవల మరణించిన కాపు సంఘం నాయకుడు పులుగుజ్జు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ పరామర్శించారు. వారి నివాసానికి వెళ్లిన ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చి మృతుని సేవలను స్మరించారు.పులుగుజ్జు వెంకటేశ్వరరావు మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన చందు జనార్దన్, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు కూడా హాజరై మృతునికి నివాళులర్పించారు. పులుగుజ్జు వెంకటేశ్వరరావు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
