ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఇంకా 48 గంటల్లో సమ్మె ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు కార్మిక వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి.ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చర్చలకు ఆహ్వానించకపోవడం కార్మికుల్లో అసంతృప్తిని పెంచుతోంది. అయితే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, యూనియన్ల పునరుద్ధరణ తప్ప మిగతా డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని సమాచారం.రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలలో ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, సమ్మె అనివార్యమైతే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.ఈ నేపథ్యంలో రేపు మంత్రి పొన్నంతో ఆర్టీసీ జేఏసీ నేతలు మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత సమ్మెపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
