Breaking News

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్‌పై ఘోర ప్రమాదం.. కారుతో ఢీకొని యువకుడు మృతి

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలో నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా మరో ప్రాణం బలైంది. మాదాపూర్ పరిధిలోని కేబుల్ బ్రిడ్జ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉదయం వెలుగులోకి వచ్చింది.పోలీసుల సమాచారం ప్రకారం, గోస శ్యామ్ రాజ్ (32) అనే యువకుడు సోమవారం తెల్లవారుజామున బ్రిడ్జ్‌పై నిలబడి ఉండగా, జూబ్లీ హిల్స్ వైపు నుంచి అతివేగంగా వస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు అతడిని ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే కారు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్యామ్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా వాహనాన్ని గుర్తించిన పోలీసులు, పశ్చిమ బెంగాల్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నగరంలో వేగవంతమైన డ్రైవింగ్‌పై కట్టడి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విమర్శలు

హరీశ్‌రావుపై మంత్రి తుమ్మల తీవ్ర విమర్శలు.. ‘అధికారంలోకి రారు’ వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *