ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రజల మధ్య కాకుండా ఫామ్హౌస్కే పరిమితమయ్యారని ఆయన ఆరోపించారు. గత పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెడతామని హెచ్చరించారు.జీవన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, గతంలో ఎన్నికల సమయంలో ఇవి కనిపించలేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి సభకు పోటీగా కేసీఆర్ సభ ఏర్పాటు చేశారని, అది ముందుగానే ప్లాన్ చేసిన కార్యక్రమమని అన్నారు.మేడిగడ్డ అంశంపై కూడా స్పందిస్తూ, అప్పట్లో విమర్శలు చేసిన వారు ఇప్పుడు మౌనం పాటించడం ఆశ్చర్యకరమని తెలిపారు. తెలంగాణ ప్రజలు మార్పు కోసం ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు.
