Breaking News

అమరావతిపై అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు..

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మరోసారి రాజకీయ చర్చలు ముదురుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్ర విభజన జరిగి దాదాపు పన్నెండు సంవత్సరాలు గడిచినా శాశ్వత రాజధాని ఏర్పాటులో ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణమని ఆయన ఆరోపించారు. అమరావతి పేరుతో అవినీతి, కమీషన్లకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. కేంద్రం నిధులు ఇచ్చినా స్థిర నిర్మాణాలు చేపట్టకుండా తాత్కాలిక ఏర్పాట్లతో కాలక్షేపం చేశారని మండిపడ్డారు.“అమరావతి ఎప్పటికీ పూర్తికాని ప్రాజెక్ట్‌లా మారింది. మరో 100 జన్మలెత్తినా అది పూర్తి కాదు” అంటూ అంబటి రాంబాబు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.అదే సమయంలో, తమ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల విధానం ద్వారా అభివృద్ధిని వికేంద్రీకరించాలనుకున్నామని, కానీ ఆ నిర్ణయానికి అడ్డంకులు సృష్టించారని ఆయన ఆరోపించారు. ఈ కారణంగా రాష్ట్ర అభివృద్ధి ఆలస్యమైందని పేర్కొన్నారు.రాజకీయ లబ్ధి కోసం అమరావతి అంశాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రస్తావిస్తున్నారని, ప్రజల భావోద్వేగాలను ఉపయోగిస్తున్నారని అంబటి విమర్శించారు. రాజధాని అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అధికార పార్టీ నుంచి వచ్చే స్పందనపై ఆసక్తి నెలకొంది.

ఎమ్మిగనూరులో ఐపీఎల్ బెట్టింగ్ గుట్టు రట్టు.. లక్షల్లో నగదు స్వాధీనం

‘నాన్న’ అని పిలిచే అదృష్టం నాకు దక్కింది: లోకేశ్ భావోద్వేగ సందేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *