Breaking News

చత్తీస్‌గఢ్‌లో ప్రైవేట్ జెట్ కుప్పకూలింది.. పైలట్‌, కోపైలట్ మృతి

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: చత్తీస్‌గఢ్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. జష్‌పూర్–నారాయణ్‌పూర్ అటవీ ప్రాంతంలో ప్రైవేట్ జెట్ కొండను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌, కోపైలట్ మృతి చెందినట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్న సమయంలో ముందుగా చెట్టును ఢీకొని అనంతరం కొండపై కూలినట్లు తెలుస్తోంది. అయితే విమానంలో మొత్తం ఎన్ని మంది ఉన్నారు, ఇతర ప్రయాణికుల పరిస్థితి ఏమిటి అనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో రక్షణ చర్యలకు కొంత అంతరాయం ఏర్పడుతోంది. ప్రమాదానికి గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *