మహిళా ప్రేక్షకురాలి ప్రాణం తీసిన పుష్ప 2 సినిమా
పుష్ప-2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట
దిల్షుఖ్ నగర్ ప్రాంతానికి చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) మరియు సన్వీక (7) తో కలిసి పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోను చూడటానికి ఆర్టీసీ రోడ్స్ వద్ద ఉన్న సంధ్య 70 mm థియేటర్కు వెళ్లింది.
అల్లు అర్జున్ థియేటర్కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చేరుకొని తొక్కిసలాట మొదలయ్యింది. ఈ సమయంలో రేవతి మరియు ఆమె కొడుకు శ్రీ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళారు.
వెంటనే పోలీసులు వారిని విద్య నగర్లోని దుర్గాభాయి దేశముఖ్ హాస్పిటల్కు తరలించారు. కానీ రేవతి అప్పటికే మృతి చెందగా, శ్రీ తేజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్కు తరలించారు.
రేవతి మృతదేహాన్ని దుర్గాభాయి దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించారు.