గంజాయి పట్టివేత
డిసెంబర్ 19, 2024, భీమిని:
భీమిని మండలం మల్లిడి పంచాయతీ పరిధి దుబ్బగూడం గ్రామంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఒగ్గు అంజన్న మరియు ఆకుల హరీష్ అనే యువకులను, బుధవారం పోలీసులు నిర్వహించిన తనిఖీలలో పట్టు చేబట్టారు. వారి వద్ద 240 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్సై తెలిపారు.
