Breaking News

నార్వేతో భాగస్వామ్యానికి తెలంగాణ అడుగులు.. పెట్టుబడులపై చర్చలు

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నార్వే ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో కీలక భేటీ నిర్వహించింది. నార్వే రాయబారి మే ఎలిన్ స్టెనర్ నేతృత్వంలో వచ్చిన ఈ బృందం, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమైంది.ఈ సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులు పెంపు, పారిశ్రామిక అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో పరస్పర సహకారం విస్తరించే అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలు, పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పెట్టుబడిదారులకు కల్పిస్తున్న సౌకర్యాలను తెలంగాణ ప్రతినిధులు వివరించారు.ప్రత్యేకంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఆధునిక సాంకేతికతల వినియోగంతో పరిశ్రమలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై నార్వే ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని వారు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో నార్వే ఇన్నోవేషన్ విభాగం అధికారి బ్యోర్న్ ఐవర్సన్, ఫస్ట్ సెక్రటరీ సిల్జే క్రిస్టీన్ ఆండర్సన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సిరి వెసెత్ మెలింగ్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో రెండు పక్షాలు కలిసి పనిచేసి అభివృద్ధి అవకాశాలను మరింత విస్తరించాలనే నిర్ణయానికి వచ్చాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *