హైదరాబాద్, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్ట్పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పడం సత్యం గెలిచిందని పేర్కొన్నారు.న్యాయస్థానాలు ఎప్పుడూ ధర్మానికే మద్దతు ఇస్తాయని, ఈ తీర్పు దానికి ఉదాహరణ అని అన్నారు. కాళేశ్వరం అంశంపై జరుగుతున్న రాజకీయ ఆరోపణలు అసత్యమని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విషయాన్ని వాడుకుందనే ఆరోపణలు చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంతో ముఖ్యమని, పనుల్లో ఉన్న లోపాలను వెంటనే సరిచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని హరీశ్ రావు స్పష్టం చేశారు.
