Breaking News

కాపులపై వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి క్లారిటీ

రాజమండ్రి, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఖండించారు. కాపు సామాజిక వర్గాన్ని అవమానించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన మాటలను కొన్ని మీడియా వర్గాలు తప్పుగా చూపించాయని ఆరోపించారు.ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కులాల మధ్య విభేదాలు రేకెత్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనికి రాజకీయ కారణాలున్నాయని విమర్శించారు.తమ నియోజకవర్గంలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, విమర్శలు చేసే వారు వాస్తవాలపై మాట్లాడాలని సూచించారు. ప్రభుత్వం అభివృద్ధి దిశగా పనిచేస్తోందని, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతుందని గోరంట్ల తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *