ఖమ్మం /కొత్తగూడెం, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక),(బ్యూరో చీప్ వైవి): తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో క్లబ్బు ఆడిటోరియంలో, పోతినేని సుదర్శన్ అధ్యక్షతన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. రాష్ట్ర నలుమూలల నుండి రైతాంగ ప్రతినిధులు, నాయకులు హాజరైనారు. ఈ మహాసభలకు ఆలిండియా రైతు సంఘం నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, హాజరైనారు. వేలాదిమంది రైతు ప్రతినిధులు, మహిళా ప్రతినిధులు హాజరైనారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఆలిండియా అధ్యక్షులు దవలే ,ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణ, ఆల్ ఇండియా నాయకులు సారంపల్లి మల్లారెడ్డి , నంద్యాల నరసింహారెడ్డి,తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి ,విద్యాసాగర్, సాయి బాబా, బి వెంకట్, శోభన్, నాగార్జున రెడ్డి, సుదర్శన్, నాగేశ్వరరావు, రవి తదితరులు వేదికపై ఆసీనులైనారు. ఈ మహాసభలు రేపు ,ఎల్లుండి, జరగనున్నాయి అనేక రైతాంగ సమస్యలపై తీర్మానాలు చేయనున్నారు.



